
చినుకు.. చింత
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
● ఈ ఫొటోలోని రైతు నెక్కొండ మండలంలోని పనికర గ్రామానికి చెందిన మెండే రమేష్. తనకున్న ఎకరం చేనులో పత్తి విత్తనాలు విత్తనాడు. నీరందకపోవడంతో సగం గింజలు మొలకెత్తకుండా పోయాయి. దీంతో మొలకెత్తని స్థానాల్లో మళ్లీ విత్తనాలు విత్తనాలు నాటాడు. గత రెండు వారాలుగా వర్షాలు కురవకపోవడంతో మొలకలు ఎండకు మాడిపోతున్నాయి. గత ఏడాది పత్తి సాగు చేయగా ఎర్ర గులాబీ పురుగు ఆశించి తీవ్ర నష్టం వాటిల్లిందని రమేష్ వాపోయాడు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే భూమి చదును చేసి మొక్కజొన్న సాగు చేస్తానని చెప్పుతున్నాడు.
● వ్యవసాయ బావి నుంచి పైపులు ఏర్పాటు చేసుకొని పత్తి మొక్కలకు నీరు పెడుతున్న ఈ రైతు పేరు జిడ్డి దుర్గయ్య. ఇతనిది చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామం. రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని కురిసిన కొద్ది పాటి వర్షాలకు పత్తి గింజలను నాటా డు. వర్షాలు లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతుండగా సమీపంలోని రైతుకు చెందిన వ్యవసాయ బావి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకుని మొక్కలను తడుపుతున్నాడు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బావిలో సరిపడా నీరు లేక గంట మాత్రమే మోటారు నడిచేపరిస్థితి ఉంది.
న్యూస్రీల్

చినుకు.. చింత