విద్యతోనే సమాజంలో గౌరవం | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే సమాజంలో గౌరవం

Jun 19 2025 3:51 AM | Updated on Jun 19 2025 3:51 AM

విద్యతోనే సమాజంలో గౌరవం

విద్యతోనే సమాజంలో గౌరవం

ఖిలా వరంగల్‌: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలని, విద్యతోనే సమాజంలో గౌరవ, మర్యాదలు ఉంటాయని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. కరీమాబాద్‌, మధ్యకోట బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను డీఈఓతో కలిసి కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. కరీమాబాద్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడంతోపాటు వారి చదువు సామర్థ్యాలు, పాఠశాల్లో రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నూతన మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నట్లు పేర్కొన్నారు.

బాలకార్మికులను గుర్తించి బడికి పంపాలి

న్యూశాయంపేట: ఇటుక బట్టీలు, బీడీ, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలను తనిఖీ చేసి బాలకార్మికులను గుర్తించి బడికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. బాలకార్మికులను నియమించుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌పై దృష్టిసారించాలని సూచించారు. బాలకార్మిక వ్యవ స్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ పేర్కొన్నారు.

యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి

ఈనెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21, 24 తేదీల్లో వరంగల్‌ ఓసిటీ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్స్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యోగా, జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్స్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమంల్లో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, ఎంఈఓ ప్రసాద్‌, ప్రధానోపాధ్యాయులు మాధవి, కార్మిక శాఖ ఉప కమిషనర్‌ నారాయణస్వామి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్‌, డీవైఎస్‌ఓ టీవీఎల్‌ఎన్‌ సత్యవాణి, డీఎం హెచ్‌ఓ సాంబశివరావు, పురావస్తుశాఖ కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ నవీన్‌, ఎన్‌వైకే కో–ఆర్డినేటర్‌ అన్వేశ్‌, ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ శ్రీధర్‌, సీనియర్‌ యోగా శిక్షకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యశారద

పలు పాఠశాలల సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement