
ఆదర్శం.. ఒంటిమామిడిపల్లి పాఠశాల
మూసివేసిన బడికి పూర్వవైభవం తెచ్చిన గ్రామస్తులు
ఐనవోలు: ఒకప్పుడు నిరాదరణకు గురై మూసివేసిన ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం 508 మంది విద్యార్థులతో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామస్తులు కమిటీని ఏర్పాటు చేసుకుని పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రూ.6 వేలు, 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సంవత్సరానికి రూ.7 వేల చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో 17 మంది ఉపాధ్యాయులకు తోడుగా విద్యాకమిటీ మరో 10 మంది ఉపాధ్యాయులను నియమించి కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తోంది. డిజి టల్ తరగతి గదులు, గ్రంథాలయం, 40 కంప్యూటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ల కోసం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థులు క్యూ కట్టడం విశేషం. పాఠశాలను పలుమార్లు విదేశీయులు సందర్శించారు.