కలెక్టర్‌ను కలిసిన టీఎన్జీఓస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ను కలిసిన టీఎన్జీఓస్‌ నాయకులు

Jun 17 2025 4:49 AM | Updated on Jun 17 2025 4:49 AM

కలెక్టర్‌ను కలిసిన  టీఎన్జీఓస్‌ నాయకులు

కలెక్టర్‌ను కలిసిన టీఎన్జీఓస్‌ నాయకులు

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ను టీఎన్జీఓస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌ ఆధ్వర్యంలో సోమవారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్‌ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్‌, కేంద్ర సంఘం నేతలు రామునాయక్‌, పెన్షనర్ల సంఘం నేతలు సర్వర్‌ హుస్సేన్‌, గోవర్దన్‌, జిల్లా టీఎన్జీఓస్‌ నాయకులు సురేశ్‌, శ్రీనివాస్‌, రాజీవ్‌, ప్రణయ్‌, ఫాతిమా, సురేఖ, నాగరాణి, చైతన్య, రవళిక, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

టీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌

రామన్నపేట: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రై వేట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో డిప్లొ మా విద్యార్థులకు రెండో సంవత్సరం బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, టీజీఈసెట్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ బైరి ప్రభాకర్‌ తెలిపారు. ఈనెల 17 నుంచి 19 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ (స్లాట్‌ బుక్‌ చేసిన అభ్యర్థులకు), 17 నుంచి 21 వరకు ఆప్షన్ల ఎంపిక (కళాశాలు, కోర్సులు), 21న ఆప్షన్ల ఫ్రీజింగ్‌, 25వ తేదీలోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు, 25 నుంచి 29 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ర్యాంక్‌ కార్డు, హాల్‌ టికెట్‌, ఎస్సెస్సీ మెమో, డిప్లొమా సర్టిఫికెట్‌, స్లడీ సర్టిఫికెట్‌, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, టీసీ, తదితర సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని వివరించారు. మరిన్ని వివరాలకు htttps://tgecet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి బాక్సింగ్‌

పోటీలకు తనుశ్రీ

హసన్‌పర్తి: జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు హసన్‌పర్తికి చెందిన శీలం తనుశ్రీ ఎంపికై ంది. ఈనెల 11, 12వ తేదీల్లో బాక్సింగ్‌ అసోిసియేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన అండర్‌–17 బాక్సింగ్‌ పోటీల్లో తనుశ్రీ పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈసందర్భంగా హసన్‌పర్తి జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తనుశ్రీని స్థానిక కార్పొరేటర్‌ గురుమూర్తి శివకుమార్‌, ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి, ఉపాధ్యాయులు ఎల్లయ్య, పార్థ సారథి అభినందించారు.

వేధింపులకు పాల్పడుతున్న

వారిపై విజిలెన్స్‌ ఆరా

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే సబ్‌ డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న గ్యాంగ్‌ ఉమెన్‌లపై వేధింపులకు పాల్పడుతున్న ఇంజనీరింగ్‌ అధికారులపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు సోమవారం రైల్వే సంఘాల నాయకులు తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగాల్లో విధుల్లో ఉన్న గ్యాంగ్‌ ఉమెన్లపై కావాలనే వేధింపులకు పాల్పడుతూ, డ్యూటీలో వర్క్‌ టార్గెట్‌ ఇవ్వడ, ఉద్దేశ్యపూర్వకంగా హాజరు వేయకపోవడం, విధులకు విరుద్ధంగా సమయపాలన లేకుండా పని చేయిస్తున్న కొందరు ఇంజనీరింగ్‌ అధికారులపై సికింద్రాబాద్‌ రైల్వే విజిలెన్స్‌ విభాగాధికారులు ఆరా తీస్తున్నట్లు నాయకులు తెలిపారు.

మొరాయించిన సర్వర్‌..

రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ ఆర్‌ఓ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సోమవారం ఈ–కేవైసీ ఆధా ర్‌ సర్వర్‌ మొరాయించింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు సర్వర్‌ పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఎదురుచూశారు. తిరిగి 12.30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రతీ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ముగియాల్సిన రిజిస్ట్రేషన్లు 6.30 నిమిషాల వరకు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement