రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

Jun 17 2025 4:49 AM | Updated on Jun 17 2025 4:49 AM

రైతుల

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఆత్మకూరు: రైతులందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి రైతులతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగుచేసే సమయానికి సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక నిధులు ఇస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రూ.78వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆత్మకూరు మండలంలోని రైతులకు 11,201 మంది రైతులకు రూ.10.12 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు బీమా ద్వారా 44 మంది రైతులకు రూ.2.20 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంలో మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్‌, ఏడీఏ రవీందర్‌, ఆర్డీఓ నారాయణ, ఆత్మకూరు ఏఎంసీ చైర్‌పర్సన్‌ బీరం సునంద సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ యాదగిరి, ఎంపీఓ విమల, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్‌, వాసు, మాజీ సర్పంచ్‌లు రాజు, రవికుమార్‌, రవీందర్‌గౌడ్‌, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు వినతి..

మండలంలోని తిరుమలగిరికి చెందిన రైతులు కదిరిక సాంబయ్య రూ.70 వేలు, కదిరిక పద్మ రూ.లక్ష15వేలు రైతు బంధు తమకు రాలేదని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం ఇచ్చారు. సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించమని ఏఓ యాదగిరికి కలెక్టర్‌ సూచించారు.

ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి

‘రైతు నేస్తం’ కార్యక్రమ వీక్షణ

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం1
1/1

రైతులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement