
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సంగెం: వసతి గృహాల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రత, నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా బాలల సంక్షేమాధికారి కె.ఫ్లోరెన్స్ సూచించారు. జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, యూఆర్ఎస్ల నుంచి వచ్చిన 63 మంది కుక్లకు సంగెం కేజీబీవీలో సోమవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన నాణ్య మైన ఆహారం అందించడానికి మెనూలో మార్పులు తీసుకొచ్చిందన్నారు. శిక్షకులు స్రవంతి, మమ త, స్వరూప.. కుక్స్కి పోషకాహార ప్రాముఖ్యత, మసాలా కర్రీ తయారీ, మెనూ ప్రకారం వంటకాలపై గ్రూపులుగా విభజించి ప్రాక్టికల్స్ శిక్షణ నిర్వహించారు. వంటకాల్లో గుణాత్మక మార్పులు, ఆరోగ్యవంతమైన భోజనం అందించడంతో విద్యార్థినుల ఆరోగ్యం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి నీలిమ, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
జీసీడీఓ ఫ్లోరెన్స్