ఎల్కతుర్తి: ‘పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినా ఇంకా అధికారంలో ఉన్నామనే భావన నుంచి నాయకులు బయటకు వస్తలేరు.. విమర్శలు చేయడం కాదు.. ప్రభుత్వానికి సలహాలిస్తే వాటిని పాటిస్తాం’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ము ల్కనూరులో నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులను ఆయన ఆదివారం పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులతో ముల్కనూరు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహా నికి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర నేతలతో కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్, రోడ్డు అథారిటీ అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఎంపీ బండి సంజయ్ సహకారంతో మండలానికి నవోదయ స్కూల్ ప్రాసెస్ నడుస్తున్నదని, అలాగే పీవీ నరసింహా రావు మెమోరియల్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. వేసవి సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేశామని, ధర్మసాగర్ రిజర్వాయర్ పంపింగ్ నడుస్తున్నదని తెలి పారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి వెంట నాయకులు కొలుగూరి రాజు, ఊసకోయిల ప్రకాశ్, అశోక్ముఖ ర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఎజ్రా, కుడికందుల రాజు, చంద్రశేఖర్గుప్తా, మాచర్ల సదానందం తదితరులు ఉన్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్