టీచర్లకు తీపికబురు | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు తీపికబురు

Aug 2 2025 10:54 AM | Updated on Aug 2 2025 10:54 AM

టీచర్

టీచర్లకు తీపికబురు

నిలిచిన డిప్యూటేషన్లు..

ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్‌ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్‌ అనుమతితో ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం

ఎస్జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, ఎస్‌ఏలుగా అవకాశం

స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా ప్రమోషన్‌

ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు

ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం

షెడ్యూల్‌ ప్రకారమే..

ప్రభుత్వం ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 11లోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఆదేశించింది. అందులో భాగంగా ఆదివారం సీనియార్టీ లిస్టులను ప్రదర్శిస్తాం. జిల్లా పరిధిలో 1:3 ప్రకారం 450 మందిని ఎంపిక చేసి 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక డిప్యూటేషన్లు ఆగిపోయే అవకాశం లేదు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఫైల్‌ ప్రాసెస్‌ చేసి డిప్యూటేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ నిర్వహిస్తాం.

– ప్రవీణ్‌కుమార్‌, డీఈఓ, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నెల 11 వరకు..

ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్‌సైట్‌లలో గ్రేడ్‌–2 హెడ్‌మాస్టర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ సమానమైన క్యాడర్‌ ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్‌ లిస్టు, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్‌ సీనియార్టీ లిస్టును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్‌ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్‌ ఆర్డర్‌ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..

జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు

మహబూబ్‌నగర్‌ 791 62,724 4,650

నాగర్‌కర్నూల్‌ 808 54,152 3,513

వనపర్తి 495 38,147 2,097

జోగుళాంబ గద్వాల 448 55,289 2,064

నారాయణపేట 458 52,314 1,879

టీచర్లకు తీపికబురు 1
1/1

టీచర్లకు తీపికబురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement