శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది | - | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది

Jun 16 2025 5:08 AM | Updated on Jun 16 2025 5:08 AM

శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది

శ్రీశ్రీని ఆదుకున్న ఖ్యాతి వనపర్తిది

వనపర్తి టౌన్‌: దేశవ్యాప్తంగా మహాకవి శ్రీశ్రీకి అభిమానులున్నా.. ఆయనను కష్టకాలంలో ఆదుకొని అండగా నిలిచిన చరిత్ర వనపర్తి సొంతమని మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్‌ రాజారామ్‌ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో శ్రీశ్రీ 42వ వర్ధంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కవులు, నాయకులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారామ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ.. తన కలం, గళంతో జన చైతన్యానికి శ్రమించిన విప్లవ కమ్యూనిస్టు కవి శ్రీశ్రీ అని, కవులు, రచయితలకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో కవులు గిరిరాజాచారి, డా. నాయికంటి నరసింహశర్మ, చిలుక రవి, బాలెమియా, గాయకుడు చింతకుంట కురుమయ్య, గద్వాల కృష్ణ, నర్సింహ, సులిగిరి వెంకటస్వామి, పరమేశ్వరాచారి, శ్రీనివాస్‌ శెట్టి, రఘునాథ్‌ రెడ్డి, పుల్లారెడ్డి, గంధం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement