అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి

Jun 14 2025 6:35 AM | Updated on Jun 14 2025 6:35 AM

అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి

అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డుకు గురుకుల విద్యార్థి

దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి టీజీటీ బయోసైన్స్‌ ఉపాధ్యాయురాలు, గైడ్‌ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్‌ పవర్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌లోని సకురా సైన్స్‌ స్కూల్‌లో జరగనున్న సైన్స్‌పేర్‌ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం బయలుదేరి వెళ్తాడు.

రైతుల అనుమతి లేని

రిజర్వాయర్‌ వద్దు

బల్మూర్‌: రైతుల అనుమతి లేకుండా ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్మూర్‌, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాల్లోని 2,601 ఎకరాలు రిజర్వాయర్‌ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement