
ఏపీడీపై అదనపు కలెక్టర్కు ఫిర్యాదు
వనపర్తి: తమను అవమానించేలా, మా పనితీరును కించపర్చేలా కామెంట్స్ చేస్తున్నారంటూ డీఆర్డీఓ ఏపీడీ సుల్తాన్పై పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలు, టీఏలతో పెద్దమందడిలో నిర్వహించిన సామూహిక ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమను కించపర్చడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనీసం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయడం లేదని, పాలనలో పూర్తిగా విఫలమయ్యారని హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీడీ సుల్తాన్ను వివరణ కోరగా తాను వారి జాబ్చాట్ను గుర్తుచేశానని.. ఎవరినీ కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు.