ఈ ప్రభుత్వానికి రైతు సంక్షే మం అక్కర్లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. వేసవిలో సాగునీటి కాలువలు బాగు చేయడం, మెయింటెనెన్స్ చేయ డం చేస్తారు. ఇక్కడ మాత్రం అలా జరగడంలేదు. ఖరీఫ్ వరకూ కాలయాపన చేయడం, ఖరీఫ్లో తూ తూ మంత్రంగా పనులు చేసి, యంత్రాల వెల్డర్స్కు నిధులు కట్టబెట్టడం పరిపాటిగా మారింది. మడ్డువలస ఆయకట్టులో ఆధునికీకరణ పనులు లేవు. రేగి డి సాయన్న ఓపెన్ హెడ్ కాలువలు పూర్తిగా పాడయ్యాయి. షట్టర్లు మూలకు చేరాయి. నారాయఫు రం ఆనకట్ట కుడి, ఎడమ కాలువలకు జైకా ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగించలేకపోయారు.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
నారాయణపురం కుడి కాలువలో జైకా నిధులు పనులు ఆగిపోయాయి. గత ప్లాన్ బాగోలేదు. దిగు వ ప్రాంతాలకు నీరు అందడం లేదు. అందుకే ఏజె న్సీ ఆపేసాం. ఓ అండ్ ఎమ్ నిధులతో కొత్తగా పను లు చేస్తున్నాం. సాయన్నచానల్ పరిధిలో పెద్ద ఎత్తు న పనులు చేయాల్సి ఉంది.ప్రస్తుతం నిధులు లేవు.
– డి.రవీంద్ర, డీఈఈ,
నారాయణపురం ఆనకట్ట


