జోడుగుళ్లుపాలెంలో పదేళ్లుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం ముందు, కావాలనే వివాదాలు సృష్టించేందుకు బీజేపీ నాయకులు పార్టీ జెండా ఏర్పాటు చేయడం దుర్మార్గం. ఇతర ప్రాంతాల్లో స్థలం ఉన్నప్పటికీ, రౌడీషీటర్ల కాపలా మధ్య ఇక్కడ దిమ్మ నిర్మించడం వారి కుట్రపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి వాజ్పేయి విగ్రహాన్ని పెడతామనడం వారి అహంకారానికి నిదర్శనం. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణం. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందించని తీరు చూస్తుంటే నగరంలో అధికార పక్షం కనుసన్నల్లోనే ‘రెడ్బుక్’ రాజ్యాంగం నడుస్తోందని అర్థమవుతోంది. జెండా తొలగించే వరకు మా పోరాటం ఆగదు.
–కోరుకొండ వెంకటరత్న స్వాతి,మాజీ కార్పొరేటర్


