
మరుగుదొడ్లు లేవు
మేము అనకాపల్లి జిల్లా సీతానగరం నుంచి వచ్చాం. శుక్రవారమే బయలుదేరించారు. భోజనం, నిద్ర అంతంత మాత్రమే. ఇక్కడకు వేకువ జామునే వచ్చాం. కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేక బాటిల్స్ పట్టుకుని తుప్పల్లోకి వెళ్లాం.
–ధర్మతేజ, విద్యార్థి, అనకాపల్లి జిల్లా
యోగాసనాలు వేయనేలేదు..
ఇక్కడ యోగా ఎలాగూ చేయించలేదు. కనీసం చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఉదయం 4 గంటలకు గాజువాకలో బయలుదేరాం. ట్రాఫిక్తో ఇక్కడకి వచ్చేసరికే 8 అయిపోయింది. ఇన్ని కష్టాలు పడి ఇక్కడకు వస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. –ప్రియాంక, అగనంపూడి
కాంట్రాక్టర్ వైఫల్యం
చేపలుప్పాడ వద్ద తొక్కిసలాటలు, తోపులాటల్లో కాంట్రాక్టర్ వైఫల్యం స్పష్టంగా కనిపించంది. 2 వేలకు పైగా మందిని తాత్కాలిక కంపార్ట్మెంట్లోకి తోసేశారు. కనీసం రెండో స్క్రీన్ కూడా ఏర్పాటు చేయలేదు. జీవీఎంసీ అధికారులకు చెప్పినా వసతులు సమకూర్చలేదు.
– దోని నాగరాజు, బీజేపీ జిల్లా యూత్ అధ్యక్షుడు

మరుగుదొడ్లు లేవు

మరుగుదొడ్లు లేవు