
4,280 మరుగుదొడ్ల ఏర్పాటు
ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ చొప్పున మొత్తం 4,280 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా 35 మంది పాములు పట్టేవారితో పాటు పెద్ద సంఖ్యలో గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్లతో పాటు, అఖిల భారత అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతి కంపార్ట్మెంట్లో తాగునీరు, స్ట్రెచర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, స్నాక్ బాక్సులు సిద్ధంగా ఉంటాయి. పాల్గొనే ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, టీ షర్ట్ అందజేస్తారు. యోగా ప్రదర్శన అనంతరం వీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశారు. అందరికీ కనిపించేలా 335 ఎల్ఈడీ స్క్రీన్లు, 326 వైఫై పాయింట్లు, సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉంచారు. అత్యవసర మందులతో కూడిన 104 వాహనాలతో పాటు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక 5 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు.