
ప్రధానికి ఘన స్వాగతం
మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కె. రామ్మోహన నాయుడు, శ్రీనివాస వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ సీహెచ్. అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ ఎం. శ్రీభరత్, ప్రభుత్వ విప్ పి. గణబాబు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి విమానంలో విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కలెక్టరేట్కు చేరుకొని బస చేశారు.