జీవితంపై విరక్తితో.. | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో..

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

మొయినాబాద్‌: హోటల్‌ ఎదుట బైక్‌ పార్కు చేసి విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి మాయం చేసిన సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌ష్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లికి చెందిన ఈదులకుంటి సాయినాథ్‌ ఈ నెల 11న తన బైక్‌ను జేబీఐటీ కళాశాల ఎదురుగా ఉన్న టీ టైమ్‌ హోటల్‌ ఎదుట పార్కు చేసి విహార యాత్రకు వెళ్లాడు. 16వ తేదీ ఉదయం 11 గంటలకు తిరిగి వచ్చి చూసే సరికి పార్కు చేసిన బైక్‌ కనిపించలేదు. దీంతో తన బైక్‌ను చోరీ చేశారని గురువారం మొయినాబాద్‌ పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

తాండూరు: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు రైల్వే స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మాణిక్‌నగర్‌కు చెందిన రాము(35) పెయింటర్‌ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య యశోదతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా తాగుడుకు బానిసైన రామును ఆర్థిక, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈక్రమంలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ముంబై ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండగా రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని రైల్వే పోలీసులు తెలిపారు.

పార్క్‌ చేసిన బైక్‌ చోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement