
ఫేక్ ఓటర్ల ఫిర్యాదుపై విచారణ
ధారూరు: మండలంలోని ఎబ్బనూర్ గ్రామంలో 52 మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని వచ్చిన ఫిర్యాదుపై బుధవారం డీఆర్ఓ మంగీలాల్ విచారణ చేపట్టారు. గ్రామ ఓటరు జాబితాలో 52 మంది పేర్లు ఉన్నా వారు స్థానికంగా లేనివారని కొంతమంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్ఓ ధారురు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆ 52 మందికి సమాచారం ఇచ్చారు. మొదటి రోజు 26 మంది రావాల్సి ఉండగా 12 మాత్రమే వచ్చారు. గురువారం కూడా విచారణ చేపట్టనున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు.