
17మంది టీచర్ల సర్దుబాటు
తాండూరు రూరల్: తాండూరు పట్టణం, మండలంలోని ఆయా పాఠశాలలకు 17 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు. అంతారంతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 మంది ఎస్జీటీలు, ముగ్గురు స్కూల్ అసిస్టెంటలను వివిధ స్కూళ్లలో సర్దుబాటు చేశామని స్పష్టంచేశారు. మైసమ్మతండా, జినుగుర్తితండా, గుండ్లమడుగుతండాలో ఒక్కో ఉపాధ్యాయుడే ఉన్నాడన్నారు. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థులకు మెగురైన బోధన, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఎంఈఓ వెంట అంతారంతండా హెచ్ఎం రమేశ్, సీఆర్పీ సుభాష్ తదితరులు ఉన్నారు.