
ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలి
కుల్కచర్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని అనంతసాగర్ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పేదలను గుర్తించి వారికి నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. లబ్ధిదారులు ఇంటి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాంచంద్రయ్య, భరత్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మహేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, నాయకులు కుర్మయ్య, రఘు, కేశవులు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి