విశ్వకర్మల అభ్యున్నతికి కృషి | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మల అభ్యున్నతికి కృషి

Sep 18 2025 10:38 AM | Updated on Sep 18 2025 10:38 AM

విశ్వకర్మల అభ్యున్నతికి కృషి

విశ్వకర్మల అభ్యున్నతికి కృషి

తాండూరు రూరల్‌: విశ్వకర్మల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఖాంజాపూర్‌ గుట్ట వద్ద విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీసీ రోడ్లు, విద్యుత్‌ సదుపాయం, వంటగదుల ని ర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.

నేటి నుంచి

విధుల్లోకి జీపీఓలు

అనంతగిరి: భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ తెలిపారు. క్లస్టర్ల వారీగా గ్రామ పరిపాలన అధికారుల(జీపీఓలు) కేటాయింపు ప్రక్రియను బుధవారం పారదర్శకంగా నిర్వహించనట్లు తెలిపారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం జీపీఓలను నియమించిందన్నారు. 139 మందికి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధుల్లో చేరాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఏఓ ఫర్హీన్‌ కాతున్‌, తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత కార్యక్రమాలను

విజయవంతం చేద్దాం

తాండూరు టౌన్‌: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి తెలిపారు. మున్సిపల్‌ సిబ్బందితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి 20వ తేదీ వరకు పరిశుభ్రత కార్యక్రమాలు, 23, 24వ తేదీల్లో విద్యాలయాల వద్ద శుభ్రత, 25న చెరువుల వద్ద, 26న ప్రభుత్వ కార్యాలయాల వద్ద, 27న ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, 29, 30న పార్కుల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్‌రెడ్డి, ప్రభాకర్‌ గౌడ్‌, సోమశేఖర్‌, విజయాదేవి, రవి, మేనేజర్‌ నరేందర్‌ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్‌, ఉద్యోగులు ఉదయ్‌, వెంకటయ్య ఉమేష్‌, ప్రవీణ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐను కలిసిన

కాంగ్రెస్‌ యూత్‌ నాయకులు

యాలాల: ఇటీవల యాలాల ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన విఠల్‌రెడ్డిని బుధవారం కాంగ్రెస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్‌ విభాగం మండల అధ్యక్షుడు వీరేశం ఎస్‌ఐను సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు యూత్‌ కాంగ్రెస్‌ తరఫున అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఖాసీం, కిషన్‌, కేఎన్‌ఎస్‌, ప్రశాంత్‌కుమార్‌, రమేష్‌, నగేష్‌, మహిపాల్‌, పాల శ్రీను, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జోనల్‌ స్థాయి పోటీలు

కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ఉదయం 10 గంటలకు జోనల్‌ స్థాయి ఎస్‌జీఎఫ్‌ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు జోనల్‌ కార్యదర్శి అజీజ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, దుద్యాల్‌ మండలాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అండర్‌–14, అండర్‌–17 విభాగాలకు సంబంధించి క్రీడా కారుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement