
దాతల సహకారం మరువలేనిది
దోమ: పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని మండల విద్యాధికారి వెంకట్ అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని ఊటుపల్లి, కొండాయపల్లి గ్రామాల్లో గ్రామానికి చెందిన పట్లోళ్ల రాజేశ్రెడ్డి, ఆనంద్గౌడ్, శ్రీకాంత్రెడ్డి ఆయా పాఠశాలలకు ఎల్ఈడీ టీవీ, విద్యార్థులకు టై, బెల్టు, ఐడీ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ..ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ దాతలు కూడా సహకరిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు లాల్యనాయక్, ప్రధానోపాధ్యాయులు పరిపూర్ణ, శివప్రసాద్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
మండల విద్యాధికారి వెంకట్