
సీపీఎస్ రద్దుకు ఉద్యమిస్తాం
పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
మోమిన్పేట: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుకు ఉద్యమం చేస్తామని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని పలు పాఠశాల్లో సోమవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పాత పెన్షన్ పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శి దండు రమేశ్, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.