ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Woman Jumps From Khairatabad Flyover Injured - Sakshi

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పై నుంచి లేక్‌వ్యూ పార్క్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసముండే కోమటి చందన(20) పీజీ పూర్తిచేసింది. రెండేళ్ల క్రితం స్థానికంగా ఉండే బి.నరే‹Ùను ప్రేమ వివాహం చేసుకుంది. ఆదివారం జీడిమెట్లలో బస్సు ఎక్కి ఖైరతాబాద్‌ చౌరస్తాలో ఉదయం 9.30 గంటలకు దిగింది. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపునకు నడుచుకుంటూ వెళ్తూ ఫ్లై ఓవర్‌ మధ్యలోకి వెళ్లగానే ఫ్లై ఓవర్‌ ఫుట్‌పాత్‌పైకి ఎక్కి పక్కనే ఉన్న లేక్‌వ్యూ పార్క్‌లో దూకింది.

ఈ సంఘటను చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బంది ఆమెను హుటాహుటిన సోమాజిగూడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. పైనుంచి దూకడంతో కుడి కాలు ప్రాక్చర్‌కాగా, వెన్నెముకకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే ఆమె తన వల్ల ఎవరూ సంతోషంగా లేరని భావించి... తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top