బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Two people killed in Banjarahills Road Accident, Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టింది.

ఈ సమయంలో అటుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను భీమవరకు చెందిన ఈశ్వరి, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top