భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజ్ లోపాలపై ఎలా ముందకెళ్లాలో క్లారిటీ వచ్చిందన్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలతో చర్చించిన తర్వాత దీనిపై ఒక అంచనా వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ గైడ్లైన్స్ అనుగుణంగా ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్.
మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాలులు సందర్శించారు. వీరితో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలిందని, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఢిల్లీలో హరీష్ ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.


