‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఎన్జీవో పాత్ర? | SIT Suspects Role Of NGO In TRS MLAs Purchase Case | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఎన్జీవో పాత్ర?

Nov 27 2022 4:30 AM | Updated on Nov 27 2022 2:59 PM

SIT Suspects Role Of NGO In TRS MLAs Purchase Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు రోజు­కో మలుపు తిరుగుతోంది. తాజాగా నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పాత్రపై ప్ర­త్యే­క దర్యాప్తు బృందం(సిట్‌) అనుమానం వ్య­క్తం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావా­ల­ని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్‌మా­దిగకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ­యన విచారణాధికారి ముందు శనివారం హాజరయ్యా రు. కేసులోని నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. కే­సు­తో తన కుగానీ, సంస్థకు గానీ ఎలాంటి సంబంధ­మూ లేదని దాటవేసినట్లు తెలిసింది. అధికారులు సాంకేతిక ఆధారాలు చూపించడంతో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయిన­ట్లు సమాచారం. విజయ్‌.. గతంలో నగరానికి చెం­దిన ఓ సామాజికవర్గ రిజర్వేషన్ల పోరాట సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.  

ప్రతాప్‌గౌడ్‌ బ్యాంకు లావాదేవీలపై ఆరా.. 
అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్‌లతో జరిపిన పలు బ్యాంకు లావాదేవీలపై ప్రతాప్‌ను ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టగా.. వ్యక్తిగత అవసరాల కోసం ఆయా మొత్తాన్ని వారికి ఇచ్చానని సమాధానమిచి్చనట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement