వేడుకున్న మృతుడి అన్న రవి
బల్వంతపూర్కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ ప్రమాదావశాత్తు బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయంపై మృతుడు రాజు అన్న రవి బాధపడిన తీరు అక్కడి స్థానికులను కలిచివేసింది. ఈ హృదయ విధారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వద్దు తమ్మి.. పొద్దున్నే పోదువు
‘సిద్దిపేటలో మా బావ దీశెట్టి మల్లేశం మృతి చెందాడు. 19న దశదిన కర్మ కావడంతో తమ్ముడు రాజు తన భార్య పిల్లలతో సిద్దిపేటకు వచ్చారు. అందరం కలిసి సంతోషంగా భోజనం చేశా’మని మృతుడు రాజు అన్న రవి తెలిపారు. సాయంత్రం కావడంతో ‘అన్నా.. ఇంటికి వెళ్తాం’ అని రాజు చెప్పడంతో.. ‘చీకటి అవుతుంది. వద్దు తమ్మి.. పొద్దున పోదువు’ అని చెప్పా. ‘అన్నా నీకాళ్లు మొక్కుతా’ అంటూ.. వినకుండా తన భార్య పిల్లలతో కారులో బయల్దేరారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుందంటూ రోదిస్తూ రవి వెల్లడించారు.
రవి బాధపడుతూ ఏడ్చిన తీరు అక్కడి స్థానికులను కంటతడి పెట్టించింది. 'అన్న మాట వింటే తానిప్పుడు బతికుండేవాడని.. అయితే, 'తానే నీ కాళ్లు మొక్కుతా అన్నా.. నన్ను ఈ రాత్రే పోనివ్వు అంటూ బయలుదేరిపోయాడని, చివరికి శాశ్వత శోకం మిగిల్చాడని ప్రజలలో బాధకరంగా సాగుతున్న ఈ మాటల తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.


