Pride Place: దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

Pride Place Transgender Protection Cell Inaugurated By Telangana DGP - Sakshi

ప్రైడ్‌ ప్లేస్‌ పేరుతో ఏర్పాటు

సాక్షి,హైదరాబాద్‌: ట్రాన్స్‌జెండర్స్‌ రక్షణ కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రైడ్‌ ప్లేస్‌’పేరుతో దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో‘ప్రైడ్‌ ప్లేస్‌’లోగోను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడంలో ‘ప్రైడ్‌ ప్లేస్‌’చాలా ఉపయోగపడుతుందన్నారు.

వివక్షకు గురికాకుండా వారి రక్షణకు అన్ని చర్యలను ఈ సెల్‌ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కొంతమంది కానిస్టేబుళ్లు బృందంగా పనిచేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రత్యేక సెల్‌ ఎప్పటికప్పుడు సంబంధిత కమ్యూనిటీతో చర్చలు జరుపుతూ రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో అధికారులకు, సిబ్బందికి రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. 2019లో ట్రాన్స్‌జెండర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ప్రకారం ఈ సెల్‌ ఏర్పాటుకు కృషి చేసిన మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి, తరుణి ఎన్‌జీవో బాధ్యులు మమతా రఘువీర్, ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ ప్రతినిధులను డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top