పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం | Palm Oil Raithula Aathmiya Sammelanam At Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం

May 14 2026 9:19 PM | Updated on May 14 2026 9:19 PM

Palm Oil Raithula Aathmiya Sammelanam At Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో  పామాయిల్ రైతు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన బయోఫెర్టిలైజర్ స్టాల్ సందర్శకులకు, రైతులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

పెద్ద సంఖ్యలో రైతులు స్టాల్‌ను సందర్శించి, సుస్థిర పంట ఉత్పత్తి కోసం జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు. దీనిలో భాగంగా సాంకేతిక నిపుణుల బృందంతో రైతులు చర్చించారు. పంట దిగుబడి, నేల సారవంతం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సూక్ష్మజీవ సాంకేతికతల ప్రయోజనాల గురించి ప్రధానంగా చర్చించారు.


 


 

Advertisement
 
Advertisement
Advertisement