బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు | minister ponnam prabhakar said that the free electricity scheme will continue | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు

Jan 5 2024 2:47 AM | Updated on Jan 5 2024 8:07 AM

minister ponnam prabhakar said that the free electricity scheme will continue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాండ్రీలు, ధోబీఘాట్‌లు, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు.

అయితే బకాయిల పేరిట విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్‌లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement