
30న ప్రభుత్వానికి నివేదిక తనిఖీల కోసం 10 కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు ప్రాక్టికల్స్కు అవసరమైన ఏర్పాట్లలో ఉన్న లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. 26 వైద్య కళాశాలల్లో లోపాలపై జాతీయ వైద్య కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ నరేంద్ర కుమార్ ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చారు. అంతకుముందే సీఎం రేవంత్రెడ్డి ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశా రు.
ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి నివే దిక అందజేయాలని ఆదేశించారు. దీంతో 10 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు 25 నుంచి 29 వరకు 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సౌకర్యాలను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై 30న ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో ఎన్ఎంసీ అధికారులకు సైతం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలియజేశారు.