వారికి రెమిడెసివిర్, ప్లాస్మా చికిత్సతో సమస్యలు తప్పవు

Growing Plasma, Remdesivir Use Help Covid Virus Mutate, Becoming Stronger - Sakshi

కరోనాకు ఇస్తున్న మందులు, చికిత్సతో సమస్య జటిలం 

విచక్షణారహితంగా వాడటం వల్ల వైరస్‌ జన్యువుల్లో మార్పులు 

మోస్తరు లక్షణాలున్న వారికీ రెమిడెసివిర్, ప్లాస్మా చికిత్సతో సమస్యలు 

కరోనా చికిత్సపై ప్రముఖ డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్‌కర్‌ అభ్యంతరాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు కరోనా బాధితులకు అందిస్తున్న మందులు, అనుసరిస్తున్న చికిత్స పద్ధతుల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్‌కర్‌. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌)లో పనిచేసిన ఆయన ఎప్పటికప్పుడు కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఈ వైరస్‌కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో ప్రపంచానికి తెలియజేసేవారు. గతేడాది జూన్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. తాజాగా కరోనా వైరస్, అందిస్తున్న చికిత్స పద్ధతులపై కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ వెబ్‌ పోర్టల్‌ ‘ది ప్రింట్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

విచ్చలవిడి చికిత్సల వల్లే.. 
‘కోవిడ్‌ చికిత్సకు పనికిరావని నిర్ధారణ అయిన చికిత్స పద్ధతులను విచక్షణరహితంగా వాడటం వల్ల వైరస్‌ రూపాంతరం చెందడమే కాకుండా.. మరింత శక్తిమంతం అవుతుంది. తేలికపాటి లక్షణాలున్న వారికి కూడా రెమిడెస్‌విర్‌ వాడటం, మోస్తరు నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి ప్లాస్మా ఇస్తే వైరస్‌ బలం పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ రకమైన చికిత్స పద్ధతులు, మందులు వాడొద్దని వైద్యులు, ఆస్పత్రులకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. లేదా వాటిని సహేతుకమైన పద్ధతిలో వాడటమైనా అలవాటు చేయాలి. భారత్‌లో రూపాంతరం చెందిన వైరస్‌లు ఎక్కువ కావడం ఇతర దేశాలకూ ఆందోళనకరమైన అంశం. అస్పష్టమైన చికిత్సలు, మందుల వాడకం ద్వారా టీకాలకు లొంగని రూపాంతరాలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఏదైనా కొత్త వ్యాధిని ఎదుర్కొనేందుకు పురాతన కాలంలో ప్లాస్మాను ఉపయోగించేవారు.

భారత్‌లో ప్రస్తుతం దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నాం. వైరస్‌ సోకిన ఏడో రోజు తర్వాత ప్లాస్మా అస్సలు ఇవ్వకూడదు. వైరస్‌లలో లోపాలతో కూడిన పునరుత్పత్తి ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి కారణంగానే జన్యుపరమైన మార్పులు జరుగుతుంటాయి. వైరస్‌తో కూడిన కణాలు ఎన్ని ఎక్కువసార్లు విభజితమైతే.. రూపాంతరం చెందేందుకు, జన్యుమార్పులను పోగేసుకునేందుకు అవకాశాలు అంతగా పెరుగుతాయి. ఈ జన్యు మార్పులన్నీ ప్రమాదకరం కాకపోయినా అసమర్థమైన, అహేతుకమైన యాంటీవైరల్‌ మందుల వాడకం లేదా రోగ నిరోధక వ్యవస్థ ద్వారా ఒత్తిడి పెంచేందుకు ప్లాస్మాను ఉపయోగించినా వైరస్‌ అప్రమత్తమవుతుంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఆ క్రమంలో వైరస్‌ మరింత సమర్థ, శక్తిమంతంగా మారొచ్చు.’  చదవండి: (వ్యాక్సిన్‌ విదేశాలకు ఎందుకంటే..)  

రెమిడెసివిర్‌తో ఇలా జరగొచ్చు.. 
‘వైరస్‌ పునరుత్పత్తి ఎంజైమ్‌లన్నింటిపై కాకుండా ఏదో ఒకదానిపై రెమిడెసివిర్‌ ప్రభావం చూపుతుంది. ఇదికాస్తా మందు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని జన్యుమార్పులు చేసి నకళ్లు సృష్టించేందుకు వైరస్‌కు అవకాశం కల్పిస్తుంది. ప్లాస్మా చికిత్స వాడిన వారిలో వైరస్‌ 4 రెట్లు ఎక్కువ వేగంతో రూపాంతరం చెందుతుందని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రవి గుప్తా అధ్యయనంలో తేలింది. మన దేశంలో రెమిడెసివిర్‌తోనూ ఆ రకమైన ఫలితాలే ఇవ్వొచ్చు. ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేని కారణంగా దేశంలో కరోనా బాధితులకు ఎప్పుడు, ఏ చికిత్స వాడాలన్న విషయంలో స్పష్టత లేదు. ఈ సమాచారం ఉంటే రోగుల బంధువులు పలానా చికిత్స కావాలంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావు. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వొద్దు. రెమిడెసివిర్‌ ఇస్తే ఆస్పత్రిలో ఉండే సమయం కొంత తగ్గొచ్చు. తేలికపాటి లక్షణాలున్న వారికి ఈ యాంటీవైరల్‌ డ్రగ్‌ ఇవ్వడం సరికాదు. కరోనా వైరస్‌ తీవ్రమయ్యే దశలో కొన్ని చికిత్సలు సక్రమంగా పనిచేయవని చాలా మందికి తెలియదు. సామాజిక మాధ్యమాల్లో లేదా వేరే మార్గాల ద్వారా తెలుసుకుని పలానా చికిత్స ఇవ్వాలని ఆస్పత్రులకు వెళ్లడం బాధాకరం.’అని డాక్టర్‌ గంగ ఖేడ్‌కర్‌ వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-05-2022
May 12, 2022, 15:33 IST
న్యూఢిల్లీ: కరోనాతో గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్నీ ఎంతలా అతలాకుతలమయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ కరోనామహమ్మారి నుంచి...
08-05-2022
May 08, 2022, 17:43 IST
కెవాడియా(గుజరాత్‌): కోవిడ్‌ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
03-05-2022
May 03, 2022, 03:08 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం...
02-05-2022
May 02, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్‌ హెల్త్‌...
24-04-2022
Apr 24, 2022, 11:03 IST
కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం...
21-04-2022
Apr 21, 2022, 11:52 IST
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2380...
20-04-2022
Apr 20, 2022, 13:36 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి....
18-04-2022
Apr 18, 2022, 15:39 IST
వైద్య నిపుణుల ఊహ కంటే ముందే భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పెరుగుతున్న కేసుల్ని...
17-04-2022
Apr 17, 2022, 13:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కలవరం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1150 కొత్త కేసులు నమోదుకాగా.....
16-04-2022
Apr 16, 2022, 13:09 IST
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు విధించారు. మరోవైపు భారత్‌లో కూడా...
11-04-2022
Apr 11, 2022, 01:28 IST
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవాళ్లలో రక్తం గడ్డకట్టడం, చిక్కబడడం పెరిగి ప్రమాదాలకు దారి...
06-04-2022
Apr 06, 2022, 18:09 IST
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్‌ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని...
06-04-2022
Apr 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే...
06-04-2022
Apr 06, 2022, 05:09 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 16,267 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 30మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో...
27-03-2022
Mar 27, 2022, 21:30 IST
చైనాలో కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నకరోనా కేసులు. పరిస్థితి అంత తేలిగ్గా అదుపులోకి వచ్చే స్థితి ఏ మాత్రం కనబడటం లేదు.
21-03-2022
Mar 21, 2022, 12:59 IST
ఫోర్త్‌ వేవ్‌ రూపంలో కాకున్నా జూన్, జూలై నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు గాంధీ ఆస్పత్రి...
28-02-2022
Feb 28, 2022, 09:43 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐ...
28-02-2022
Feb 28, 2022, 08:26 IST
హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు...
24-02-2022
Feb 24, 2022, 14:35 IST
పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని.. వేవ్‌ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని ప్రొఫెసర్‌ రాజారావు అభిప్రాయపడ్డారు.
19-02-2022
Feb 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ డ్రాప్స్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...



 

Read also in:
Back to Top