ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు పాజిటివ్‌

Corona To Ramalingareddy Family Members - Sakshi

సాక్షి, సిద్దిపేట: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో రామలింగారెడ్డి భార్య, కుమారుడు, ఇద్దరు పిల్లలకు పాజిటివ్‌ ఉన్నట్లు మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు.   

ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు పాజిటివ్‌
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top