నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌ | CM Revanth to visit Kaleshwaram projects and Medigadda barrage on April 20 | Sakshi
Sakshi News home page

నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్‌

Apr 20 2026 4:37 AM | Updated on Apr 20 2026 4:37 AM

CM Revanth to visit Kaleshwaram projects and Medigadda barrage on April 20

సాక్షి, హైదరాబాద్‌ /సాక్షిప్రతినిధి, వరంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌­కుమార్‌రెడ్డితో కలిసి సీఎం మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భూపాలపల్లి జిల్లా­లోని కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల­కు భూమిపూజ చేస్తారు. అనంతరం హెలికా­ప్ట­ర్‌ ద్వారా మేడిగడ్డ బరాజ్‌కు చేరుకొని పునరుద్ధ­రణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు.

అంబట్‌­పల్లిలోని అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరు­లతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తుర్‌పల్లికి చేరుకొని అక్క­డ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బహి­రంగసభ వేదికగా రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అనంతరం రాత్రి 7.45 గంటలకు నస్తుర్‌పల్లి నుంచి రోడ్డు మార్గా­న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
అబద్ధాల పునాదులపైనే రేవంత్‌ సీఎం అయ్యారు

Advertisement
 
Advertisement
Advertisement