తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన | CJI Foundation Stone For Construction Of Telangana High Court Building | Sakshi
Sakshi News home page
breaking news

తెలంగాణ కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

Mar 27 2024 6:30 PM | Updated on Mar 27 2024 6:57 PM

CJI Foundation Stone For Construction Of Telangana High Court Building - Sakshi

రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో  సీజేఐతో పాటు తెలంగాణ  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు.

ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement