30 Percent Wage Revision for Contract and Outsourcing Employees - Sakshi
Sakshi News home page

జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్‌సీ 

Jul 24 2023 5:46 AM | Updated on Jul 24 2023 6:50 PM

30 percent wage revision for contract and outsourcing employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు.

తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్‌ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement