తిరువళ్లూరు: తీర్థశ్వరుడి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మాత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉదయం స్వామి వారు అమ్మవారితో కలిసి నెమలివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువళ్లూరులోని శ్రీ త్రిపుర సుందరి సమేత తీర్థ్ధేశ్వరుడి ఆలయం వుంది. ఆలయంలో ప్రతి ఏటా ఫంగుణి, మాసి మాసంలో 12 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత శుక్రవారం విఘ్నేశ్వర ఉత్సవం, శనివారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం ఉదయం స్వామి వారు అమ్మవారితో కలసి నెమలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి వారికి తిరుమంజనం నిర్వహించారు.


