ఘనంగా ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం

Mar 8 2026 7:58 AM | Updated on Mar 8 2026 7:58 AM

వేలూరు: వేలూరు వేలపాడిలోని గ్రామ దేవతైన శ్రీ ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ నిర్వహక కమిటీ సభ్యులు అములు, డాక్టర్‌ అయ్యప్పన్‌, వేణు అద్యక్షతన ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని రఽథంలో ఆశీనులు చేసి దీపారధన పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో పాటూ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణాల మధ్య రథాన్ని లాగారు. ఈ రథం వేలపాడిలోని పలు వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రతి ఇంటి ముందు మహిళా భక్తులు బొరుగులు, ఉప్పు, మిర్యాలు, పుష్పాలు చల్లడంతో పాటూ కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు దాతలు, పారిశ్రామికవేత్తలు అన్నదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement