3వ తరం ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ ప్లే ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

3వ తరం ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ ప్లే ఆవిష్కరణ

Aug 1 2025 11:50 AM | Updated on Aug 1 2025 11:50 AM

3వ తరం ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ ప్లే ఆవిష్కరణ

3వ తరం ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ ప్లే ఆవిష్కరణ

సాక్షి, చైన్నె: అమెజాన్‌ అలెక్సాన్‌ ఇండియాతో కలిసి మూడవ తరం ఎకో షో 5 స్మార్ట్‌ డిస్‌ప్లేను ఆవిష్కరించింది. ఇది సులభంగా ఇంటి పర్యవేక్షణ, స్ట్రీమింగ్‌ అనుకూలమైన భద్రతా కెమెరా వీడియో ఫీడ్‌లు, ఆడియో–విజువల్‌ కంటెంట్‌ను చూడటం , మరిన్నింటి కోసం అంతర్నిర్మిత కెమెరాతో కూడిన కాంపాక్ట్‌ 5.5 స్మార్ట్‌ డిస్‌ప్లేను ఇది కలిగి ఉన్నట్టు గురువారం స్థానికంగా ప్రకటించారు. దీని గురించి అమెజాన్‌ డివైసెస్‌ ఇండియా డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ దిలీప్‌ వివరిస్తూ ఇది మునుపటి తరంతో పోలిస్తే 2 ఎక్స్‌ బేస్‌, స్పష్టమైన ధ్వనితో ఉత్తమంగా ధ్వనించే ఎకోషో 5 అని వివరించారు. ఇప్పుడు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమాలతో పాటూ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉందని వివరించారు. అలెక్సాతో రోజువారీ క్షణాలను మరింత ఉపయోగకరంగా మార్చడానికి రూపొందించబడినట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement