
గంజాయి స్వాధీనం
వేలూరు: జోలార్పేట రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు 15 బండళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రైల్యే పోలీసులు కాట్పాడి, జోలార్పేట, ఆంబూరు రైల్వేస్టేషన్లలో తనఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తిరుపత్తూరు జిల్లా జోలార్పేట రైల్వేస్టేషన్కు హతియా ఎక్స్ప్రెస్ గురువారం వేకువజామున వచ్చింది. ఆ సమయంలో రైల్వే పోలీసులు రైలు బోగీల్లో తనఖీ చేయగా మరుగుదొడ్డిలో గంజాయి బండల్స్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా 15 బండల్స్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని జోలార్పేట పోలీసులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.