
అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తెలంగాణ సీఎం సతీమణి
వేలూరు: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి సతీమణి గీతారెడ్డి తన కుమార్తెలతో కలిసి గురువారం ఉదయం స్వామివారి దర్శనార్థం వెళ్లారు. ఆమెకు ఆలయంలో శివాచార్యులు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆమె ఆలయ ప్రాంగణంలోని అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారి, నవగ్రహ సన్నిధులను, దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం శివాచార్యులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరువణ్ణామలైలో జరుగుతున్న మహా విల్కే యాగ పూజల్లో పాల్గొన్నారు.