
ఎర్ర చందనం కేసులో ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్ర చందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడుకు చెందిన పరమన్ అన్బుకు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్ర చందనం కేసుల విచారణ సెషన్స్ కోర్టు జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు. 2017 సంవత్సరంలో నిందితుడు అన్బు తిరుపతి కృష్ణాపురం సెక్షన్, కరకంబాడి బీట్, శేషాచలం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరకడానికి ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. నేరం అన్బుపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
శ్రీసిటీ సీఎఫ్ఓకు పురస్కారం
శ్రీసిటీ (సత్యవేడు) : ముంబైలో ఈనెల 18న జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిగిన 8వ వార్షిక బిజినెస్ వరల్డ్ సీఎఫ్ఓ వరల్డ్ ఫైనాన్స్ స్ట్రాటజీ ఎక్సలెన్స్ అవార్డుల్లో శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఆర్.నాగరాజన్కు ప్రతిష్టాత్మక బెస్టు సీఎస్ఓ ఇన్ స్మాల్ ఎంటర్ఫ్రైజ్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఆర్థిక ప్రణాళిక, పనితీరుకు ఆయనకు అవార్డు దక్కింది.