
దేశ సేవలో భాగం కావాలి
– సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్
సాక్షి, చైన్నె: వైద్యకోర్సుల్లో పట్టభద్రులైన యువకులు దేశ సేవలో భాగమై త్రివిధ సైనిక దళాల్లో వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలని ఢిల్లీలోని సైనిక దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ పిలుపునిచ్చారు. చైన్నె పోరూరులోని శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీమ్డ్ యూనివర్సిటీ) 39వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ పాల్గొని స్నాతకోత్సవ సందేశమిచ్చారు. వైద్యరంగంలో కృతిమ మేధోపరిజ్ఞానం(ఏఐ) రోబోటిక్ సర్జరీల ప్రాధాన్యతలు పెరిగాయని అన్నారు. ఈ అవకాశాలుగా సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే త్రివిధ దళాలో వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్యరంగంలోకి వచ్చిన యువతీ యువకులు సేవాభావం అలవరుచుకోవాలి పిలుపునిచ్చారు. చాన్స్లర్ వీఆర్ వెంకటాచలం, ప్రొ.చాన్స్లర్ ఆర్వీ సెంగొట్టవన్, వైస్ చాన్స్లర్ డాక్టర్ ఉమాశంకర్ సమక్షంలో వైద్య పట్టాలు అందుకున్నవారిలో 29 మంది విద్యార్థులకు 40 బంగారు పతకాలను ఆమె అందజేశారు. ప్రత్యేకించి డాక్టర్ సంజన.వి అనే విద్యార్థిని ఐదు బంగారు పతకాలు అందుకోవడం విశేషం. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 637 మందికి యూజీ, పీజీ డిగ్రీలు ప్రదానం చేశారు.

దేశ సేవలో భాగం కావాలి