
కల్నల్ సంతోష్బాబు త్యాగం వెలకట్టలేనిది
సూర్యాపేటటౌన్ : దేశం కోసం కల్నల్ సంతోష్బాబు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. కల్నల్ సంతోష్బాబు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సంతోష్బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసిన కల్నల్ సంతోష్బాబును నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కల్నల్ సంతోష్బాబు త్యాగాన్ని స్మరించుకోవడం ఆయన కుటుంబాని ఎంతో ఓదార్పు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్బాబు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఆర్మీ జవాన్లు, విద్యార్థులు, పట్టణప్రముఖులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ