
కొత్త అడ్మిషన్లు 106
ఆరోతరగతిలోనే
72మంది చేరిక
ఈ విద్యాసంవత్సరం ఒక్క ఆరో తరగతిలోనే 72 మంది విద్యార్థులు చేరారు. పాఠశాలలో కొత్తగా 106 మంది విద్యార్థులు చేరారు. దీంతో ఈస్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 460కి చేరింది. మరో 50 వరకు అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
కోదాడరూరల్ : అది.. కోదాడ పట్టణంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల. ఇక్కడి ఉపాధ్యాయులకు విధుల పట్ల ఉన్న అంకితభావం.. కృషి.. ఉత్తమ బోధన.. వెరసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. బుధవారం ఓ విద్యార్థిని ఎంఈఓ సలీమ్ షరీఫ్ పాఠశాలలో చేర్చుకున్నారు. తద్వారా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 106 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ తీసుకున్నట్లు అయ్యింది.
మంచి ఫలితాలు సాధించడంతో..
ఈ పాఠశాలలో గత సంవత్సరం మొత్తం 455మంది ఉండేవారు. వీరిలో పదో తరగతిలో 99 మంది ఉండేవారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఇక్కడి విద్యార్థి 571 మార్కులు సాధించడం ద్వారా జిల్లాలోనే టాపర్గా నిలవడంతో పాటు మరో ఆరుగురు 500కుపైగా మార్కులు సాధించారు. అదే విధంగా ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇదంతా ఉపాధ్యాయుల కృషికి నిదర్శనంగా చెబుతున్నారు.
వినూత్న రీతిలో ప్రచారం
ఈ విద్యా సంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆటోకు మైక్ ఏర్పాటు చేసుకొని కోదాడ పట్టణంతో పాటు సమీపంలోని శ్రీరంగాపురం, అశోక్నగర్, దుర్గాపురం, సాలార్జంగ్పేట్, రామిరెడ్డిపాలెం, వెంకట్రాంపురం, ఖానాపురం, అజ్మీరతండా, బొజ్జగూడెం తండాల్లో ప్రచారం నిర్వించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఉత్తమ బోధన, ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు.
తరగతుల వారీగా కొత్త అడ్మిషన్లు
తరగతి విద్యార్థుల
సంఖ్య
6వ 72
7 08
8 16
9 05
10 05
ఫ కోదాడ జెడ్పీ బాలుర ఉన్నత
పాఠశాలలో చేరేందుకు
విద్యార్థుల ఆసక్తి
ఫ 460కి చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య
ఫ ఉపాధ్యాయుల కృషి, ఉత్తమ బోధన ఫలితం

కొత్త అడ్మిషన్లు 106