
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నడిగూడెం : ప్రజలకు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ కె.నరసింహ కోరారు. బుధవారం మోతె పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని డైరీ, రిసెప్షన్ రిజిస్టర్, కేసుల స్థితిగతులు, పలు రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. పారదర్శకంగా పని చేయాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆయన వెంట మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పెన్షనర్ల సవరణ
చట్టాన్ని రద్దు చేయాలి
కోదాడరూరల్ : కేంద్ర ప్రభుత్వం మార్చిలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా పెన్షనర్ల చట్ట సవరణ బిల్లు ఆమోదించడం బాధాకరమని, దీనిని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య కోరారు. బుధవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్ భవన్లో చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. పెన్షనర్ల హక్కులను, ప్రయోజనాలను కాలరాసేలా నూతన చట్టాన్ని రూపొందించడం సరైనది కాదని అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 23న కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చే కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలోబొల్లు రాంబాబు, రఘువరప్రసాద్, హనుమారెడ్డి, గడ్డం నర్సయ్య, సత్తయ్య, రుక్ముద్దీన్, సాంబులు, జాన్షరీఫ్, వరప్రసాద్, చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
కోదాడ నుంచి దాచేపల్లికి ఆర్టీసీ బస్సు
మఠంపల్లి: కోదాడ డిపోనుంచి హుజూర్నగర్, మట్టపల్లి క్షేత్రం మీదుగా ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లికి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును బుధవారం కోదాడ డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మట్టపల్లి క్షేత్రానికి చేరుకునే రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కోరిక మేరకు మంత్రి ఉత్తమ్ చొరవతో బస్సును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు కోదాడలో బయలుదేరి హుజూర్నగర్,, మఠంపల్లి, మట్టపల్లి, తంగెడ. ముత్యాలంపాడు మీదుగా 8గంటల వరకు దాచేపల్లి చేరుకుంటుందన్నారు. తిరిగి దాచేపల్లిలో 8.30 కు బయలు దేరి ఉదయం 10.30కు హుజూర్నగర్కు చేరుకుంటుందని తెలిపారు. హుజూర్నగర్ నుంచి దాచేపల్లికి మూడు ట్రిప్పులు నడుపుతున్నట్లు చెప్పారు. సాయంత్రం దాచేపల్లినుంచి బయలు దేరి రాత్రి 7గంటల 10 నిమి షాలకు కోదాడ చేరుకుంటుదని వివరించారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి