పలాస: కాశీబుగ్గలోని టి.కె.ఆర్.కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పి.డి.ఎస్.యు. విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ చెప్పారు. గురువారం పలాస సూదికొండ కాలనీలోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.వినోద్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులు, శాసీ్త్రయ, లౌకిక, ప్రజాస్వామిక విలువల పరిరక్షణపై విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పి.డి.ఎస్.యు.రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.ప్రసాద్, భారత విద్యాహక్కుల వేదిక నాయకులు రమేష్ పట్నాయక్, ఎ.పి.టి.ఎఫ్. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు.


