ప‘రేషన్’రేషన్దారులపై ఈకేవైసీ పిడుగు పడుతోంది. ఈ నెల 3
ఆర్తులకు అండగా..
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలోని తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం అందజేసింది. ఒక్కో కుటుంబానికి సోమవారం రూ.2 లక్షల చొప్పున అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి ఇన్చార్జి పేరాడ తిలక్, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంత్రెడ్డి, దుబ్బ వెంకట్రావుతో పాటు స్థానిక నాయకులంతా టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామంలో రాపాక విజయ కుటుంబానికి, రామేశ్వరం గ్రామంలో ఏదూరి చిన్నమ్మి కుటుంబానికి, నందిగాం మండలం శివరాంపురం గ్రామంలో చిన్ని యశోదమ్మ కుటుంబానికి రూ.2 లక్షల చొప్పు న ఆర్థిక సాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు అందించాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన నందిగాం మండలం శివరాంపురానికి చెందిన ముగడ పార్వతికి పేరాడ తిలక్ సొంతంగా రూ.10వేలు చెక్కు అందజేశారు. అలాగే టెక్కలి మండలం రామేశ్వరం గ్రా మానికి చెందిన పిన్నింటి నాగమ్మ, పిన్నింటి గౌరి, పిన్నింటి సూరమ్మ, నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ముగడ పార్వతి తదితరులకు ఒక్కొరికి రూ.10 వేల చొప్పున రూ.40 వేలు అందజేశారు. దీంతో పాటు జెడ్పీటీసీ వాణి తన వంతు సాయంగా రూ.15 వేలు అందజేశారు. – టెక్కలి, నందిగాం
కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన వైఎస్సార్సీపీ
ప‘రేషన్’రేషన్దారులపై ఈకేవైసీ పిడుగు పడుతోంది. ఈ నెల 3
ప‘రేషన్’రేషన్దారులపై ఈకేవైసీ పిడుగు పడుతోంది. ఈ నెల 3
ప‘రేషన్’రేషన్దారులపై ఈకేవైసీ పిడుగు పడుతోంది. ఈ నెల 3


