
వృద్ధుడు అదృశ్యం
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం గ్రామానికి చెందిన కంఠస్ఫూర్తి కనకరాజు ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని జే.ఆర్.పురం పోలీసులు సోమవారం తెలిపారు. వయస్సు 78 సంవత్సరాలు, మతి స్థిమితం సరిగ్గా లేదని చెప్పారు. ఈ మేరకు కుమారుడు సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్.చిరంజీవి వెల్లడించారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి దూసి – పొందూరు రైల్వేస్టేషన్ల మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి సుమారు 65 ఏళ్ల వయస్సు ఉంటుందని, నీలం, ఎరుపు రంగు గీతల షర్టు, నీలం గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు.